అంబేద్కర్ రమబాయ్ గొప్ప మానవతవాది.

TEJA NEWS

అంబేద్కర్ రమబాయ్ గొప్ప మానవతవాది.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

అంబేద్కర్ సతీమణి
రమాబాయ్ 89 వ వర్ధంతి సందర్బంగా షాపూర్ నగర్ లో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రామాబాయ్ ఓపిక వల్లే అంబేద్కర్ చదువుకొని,ఈ దేశ ప్రజల కోసం అత్యున్నతమైన రాజ్యాంగం రాయగలిగారని,తన నలుగురి సంతానంలో 3చనిపోయినప్పటికి ఎంతో దుఃఖం ఉన్నప్పటికి అన్నింటిని దిగమించుకొని అంబేద్కర్ కి సహకరించరాని అలాంటి గొప్ప మానవత వాది జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోని పనిచెయ్యాలని కార్యకర్తలను కోరారు.
ఈ సమావేశానికి మండల కార్యదర్శి స్వామి,సహాయ కార్యదర్శులు హరినాథ్,రాములు, కార్యవర్గ సభ్యులు నర్సింహారెడ్డి, నాగయ్య, కనకయ్య,విట్టల్,ఎల్లం తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top