లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడిన ఆసిఫాబాద్ పౌర సరఫరాల అధికారులు

TEJA NEWS

లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడిన ఆసిఫాబాద్ పౌర సరఫరాల అధికారులు

ఆసిఫాబాద్‌: ఫిర్యాదుదారునికి చెందిన లారీలలో లోడ్ చేయబడిన పిడిఎస్ బియ్యాన్ని అతని గోదాం నుండి ఆసిఫాబాద్‌లోని పౌర సరఫరాల గోదాముకు రవాణా చేసేందుకు రూ. 75,000/- లంచం స్వీకరిస్తూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారి బృందాలకు పట్టుబడ్డారు.లంచం తీసుకున్న అధికారులు ఆసిఫాబాద్ జిల్లా పౌర సరఫరాల కార్యాలయ మేనేజర్ గురుబెల్లి వెంకట్ నర్సింహారావు,అలాగే సాంకేతిక సహాయకుడు (పొరుగు సేవలు) కొత్తగొల్ల మణికాంత్.ఫిర్యాదుదారుని ఫిర్యాదుతో ఏర్పాటైన ఉచ్చు ఆపరేషన్‌లో,లంచం మొత్తాన్ని స్వీకరిస్తున్న వేళ ఈ ఇద్దరినీ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

You cannot copy content of this page

Scroll to Top