ఇక నుంచి ‘ఈ-ఆఫీస్’ విధానంలో క్యాబినెట్ భేటీలు!
క్యాబినెట్ సమావేశాలను ఇక నుంచి ఈ-ఆఫీస్ మోడ్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రింట్స్ లేకుండా అన్ని పేపర్లెస్ గా జరగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మంత్రులు ఫైళ్లను చెక్ చేయడం, ఆమోదించడం వంటివి డిజిటల్గానే జరగనున్నట్లు సమాచారం. క్యాబినెట్ మీటింగ్లో చర్చించేదంతా డిజిటల్గా రికార్డు కానుంది. తదుపరి క్యాబినెట్ భేటీ జులై 10న నిర్వహించనున్నారు.
