ఇళ్లు రాని వాళ్లంతా అప్లై చేసుకోవాలి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ పేదలందరికీ 2029 నాటికి ఉచితంగా ఇళ్లు
ఇళ్ల స్థలాలు అందిస్తామని CM CBN అసెంబ్లీలో వెల్లడించారు. ‘ఇళ్లు రాని వాళ్లంతా దరఖాస్తు చేసుకోవాలి. 2.20 లక్షల కుటుంబాలకు ఇంటి జాగాలు లేవు. వారికి పట్టణ ప్రాంతాల్లో 2, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఉచితంగా కేటాయిస్తాం ఈ ఏడాదిలో 10.63 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయిస్తాం. గత పాలకులు హౌసింగ్లో అక్రమాలు చేశారు. ఇందుకు బాధ్యులను శిక్షిస్తాం’ అని పేర్కొన్నారు.
