నరసరావుపేట మున్సిపాలిటీకి కమిషనర్ లేక నెల రోజులుగా పాలన స్తంభించిందని, ప్రస్తుతం ఇంజినీరింగ్ అధికారి ఇన్ఛార్జ్ బాధ్యతల్లో ఉన్నారని తెలుస్తోంది. రాజకీయ కారణాలతోనే నియామకం వాయిదా పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునే వారు లేక ప్రజా సమస్యలు పేరుకుపోతున్నాయని, వెంటనే పూర్తిస్థాయి కమిషనర్ను నియమించాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
