డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజును మర్యాదపూర్వకంగా కలిసిన దారపనేని
కనిగిరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజును గురువారం కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దారపనేని రఘురామకృష్ణం రాజు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విజయవాడలోని తన స్వగృహంలో అల్పాహార విందుకు హాజరుకావాలని ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు తప్పకుండా వస్తానని తెలిపారని దారపనేని పేర్కొన్నారు.
