పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ

TEJA NEWS

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చౌక దారుల దుకాణంలో పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రమంతా శ్రీకారం చుడుతున్న సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి సూచనల మేరకు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రగతి నగర్ చౌక దారుల దుకాణలలో పేద ప్రజల కోసం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి గారు సన్న బియ్యం కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో మహిళ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ షేక్ రఫీయాబేగమ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిట్ల దివాకర్, కోలన్ జీవన్ రెడ్డి, వాసు, మురళి, ఆరావింద్, బిక్కన్ షా, వీర బాబు, సాగర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మహేష్, బల్వంత్ రెడ్డి, నారాయణ రెడ్డి, తులసి దాస్, రవీందర్, రఫాత్, మధుసూదన్ రెడ్డి మరియు కార్యకర్తలు , కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top