సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ

TEJA NEWS

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మంజూరు చేయించిన రూ.2,99,500/- సిఎం రిలీఫ్ ఫండ్ సంబంధిత 8 చెక్కులను లబ్ధిదారులు అందజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉండి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ విష్ణు వర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు మాదాస్ నవీన్, రంజిత్ రెడ్డి, బాలకృష్ణ, అశోక్, ప్రవీణ్ నాయక్, కుంట్ల నందు మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top