చిలుకూరులో సమాభావన సంఘం భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం.
సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య……
చిలుకూరులో నూతన గ్రామ సమాభావన సంఘం భవన నిర్మాణ పనులను ప్రారంభింస్తున్న సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య… చిలుకూరులో ఎన్ఆర్రిజీఎస్ నిధులు రూ. 10 లక్షల తో నిర్మించనున్న నూతన గ్రామ సమాభావన సంఘం భవన నిర్మాణ పనులను శుక్రవారం సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వచ్చే నిధులతో ప్రాధన్యత ప్రకారం గ్రామాభివృద్ది చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గిరిబాబు, ఎంపీవో ముక్కపాటి నరసింహారావు, ఉప సర్పంచ్ బెల్లంకొండ నాగయ్య, పంచాయితీ రాజ్ ఏఈ రంగారావు, గ్రామ కార్యదర్శి షరీఫుద్దీన్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
