శ్రీకాళహస్తీశ్వరుని సేవలో గిరినాయుడు…

TEJA NEWS

శ్రీకాళహస్తీశ్వరుని సేవలో గిరినాయుడు
తిరుపతి / శ్రీకాళహస్తి:
ఏర్పేడు మండలంలోని గుడిమల్లంలో వెలసిన దేశంలోనే మొదటి శివాలయమైన శ్రీ పరశు రామేశ్వరస్వామి వారి ఆలయ బోర్డు చైర్మన్ బత్తల గిరినాయుడు శుక్రవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కాళహస్తి ఆలయ అధికారులు గిరినాయుడుని సాదరంగా ఆహ్వానించి, అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఏపీఆర్వో దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top