126 – జగద్గిరిగుట్ట డివిజన్ మగుదుమ్ నగర్ లో మైనారిటీ నాయకులు ముంతాజ్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా నెల రోజుల పాటు అల్లాను కొలుస్తూ ఉపవాసలు చేస్తూ అత్యంత నిష్ఠ తో నిర్వహించే ఉపవాస దీక్షలు, ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీక అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, వివిధ డివిజన్లకు చెందిన నాయకులు, మైనారిటీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.
