INTUC రాష్ట్ర అధ్యక్షులు గుంజ శ్రీనివాస్ ఆధ్వర్యం

TEJA NEWS

INTUC రాష్ట్ర అధ్యక్షులు గుంజ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వామపక్ష కార్మిక సంఘాల నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ రైతు బజార్ నుండి ఉషోదయ టవర్స్ వరకు గుంజ శ్రీనివాస్ ఆధ్వర్యంలో INTUC, AITUC, HMS, CITU, TUCI, IFTU నాయకులు నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై వామపక్ష కార్మిక సంఘాల నిరసన ర్యాలీ లో మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొని మద్దతు తెలిపారు..

అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…

నిరసన ర్యాలీకి మద్దతుగా నిలుస్తానన్నారు..

మోడీ ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది అన్నారు..

కార్మిక సంఘాలకు,నాయకులకు అండగా ఉంటానన్నారు..

ఈ కార్యక్రమంలో గుంజ శ్రీనివాస్,గూడ ఐలయ్య గౌడ్, సిపిఎం లక్ష్మణ్, సీపీఐ ఉపమహేశ్వర్ రావు, క్రిష్ణ గౌడ్, జంగిర్, ఆంజనేయులు,సతీష్ బాబు,నాగరాజు, జనార్దన్,జ్యోతి, లలిత,అచ్చమ్మ తో పాటు తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top