జీడిమెట్ల డివిజన్ మహిళలు కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ మహిళలు నిన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించారు.
ఈ సందర్భంగా మహిళలు నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై ఆయనతో చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన తీసుకుంటున్న చొరవకు కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం హన్మంతన్న మహిళలతో వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా నాయకులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.
