అర్హులైన వారందరూ కల్యాణ లక్ష్మీ పథకాన్ని వినియోగించుకోవాలని తెలిపిన నియోజవర్గ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సుభాష్ నగర్ ఉపాధ్యక్షులు దొడ్ల నాగేశ్వర్ రెడ్డి కుమార్తె అనూష కి రూ. 1,00116/- ల కల్యాణ లక్ష్మి చెక్కును నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి అందజేశారు. అనంతరం హన్మంతన్న మాట్లాడుతూ అర్హులైన వారందరూ కల్యాణ లక్ష్మీ పథకాన్ని వినియోగించుకోవాలని, పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సోమన్న శ్రీధర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి , రాజు చారి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, కోలన్ జీవన్ రెడ్డి, 125 డివిజన్ అధ్యక్షులు ఎండీ లాయక్, గఫ్ఫార్, అజయ్, ప్రశాంత్ రెడ్డి, సోము, అది రెడ్డి పాల్గొన్నారు.
