
వీర హనుమాన్ విజయోత్సవ శోభాయాత్రకు ముఖ్యఅతిథిగా హాజరవ్వాలని కూన శ్రీనివాస్ గౌడ్ కి ఆహ్వాన పత్రిక అందజేసిన కమిటీ సభ్యులు…
కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని జీడిమెట్ల విలేజ్ లో గల శ్రీ పాత ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వచ్చే నెల ఏప్రిల్ రెండో తేదీ నాడు సాయంత్రం నిర్వహించే శ్రీ వీర హనుమాన్ విజయోత్సవ శోభాయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని షాపూర్ నగర్ లోని నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కూన శ్రీనివాస్ గౌడ్ ని ఆహ్వానించి కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి ఆహ్వాన పత్రికను అందజేశారు…
ఈ కార్యక్రమం కమిటీ సభ్యులు శేఖర్, కళ్యాణ్, సాయి, సందీప్, జంగారెడ్డి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాలప్ప పాల్గొన్నారు…