మొదటి ప్రాధాన్యత ఓటుతో ఆలపాటి రాజా గెలిపించండి

TEJA NEWS

తాడేపల్లి

మొదటి ప్రాధాన్యత ఓటుతో ఆలపాటి రాజా గెలిపించండి: వెంకట్రావు

ఈ నెల 27న జరగనున్నఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్ల కూటమి ప్రభుత్వం బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని
టిడిపి తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు కోరారు.మంగళవారం 7, 9 ,10 వార్డులలోని ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలు సచివాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా వెంకట్రావు మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

మంగళగిరి నియోజకవర్గ పరిశీలికులు ముమ్మిడి సత్యనారాయణ,తెలుగు యువత అధ్యక్షుడు జి. నాగేశ్వరావు, మంగళగిరి నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు ఇట్టా భాస్కర్, అద్దంకి మురళి, 10వ వార్డు అధ్యక్షుడు ఉప్పు వెంకటేశ్వరావు,రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి వి.స్టాలిన్ బాబు, సుధాకర్ 9వ వార్డు సువర్ణ రాజు, 9వ వార్డు ప్రధాన కార్యదర్శి కె. కోటేశ్వరరావు, ఏడవ వార్డు అధ్యక్షుడు ఎం రవి, టీ ఎన్ ఎస్ ఎఫ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి జే అచ్చయ్య, సిహెచ్ జాన్సన్,డి చిన్న, వెంగళరావు, బి.లెనిన్, వి రత్న, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top