సెమీకండక్టర్ల తయారీ.. ఇక నుంచి భారత్లోనే!
సెమీకండక్టర్ల తయారీలో స్వయం సమృద్ధి దిశగా భారత్ అడుగులు వేస్తోంది. తాజాగా ‘ఇండియా చిప్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీకి ఉత్తర ప్రదేశ్లోని జెవార్లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా, స్వదేశీ చిప్ తయారీని ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు రానుంది. గ్లోబల్ చిప్ హబ్గా ఎదగాలంటే మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధిపై భారత్ మరిన్ని దృష్టి సారించాల్సి ఉంది.
