తిరుమల శ్రీవారి సేవలో మంత్రి అచ్చెన్నాయుడు
తిరుమల: శ్రీవారిని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు దంపతులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అచ్చెన్న దంపతులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
