ముఖ్యమంత్రి ని కుటుంబ సమేతంగా కలిసిన మంత్రి వివేక్ వెంకటస్వామి
- తెలంగాణ రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వివేక్ వెంకటస్వామి వారి సతీమణి సరోజ మరియు వారి కుమారుడు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో మర్యాధపూర్వకంగా కలిశారు
అనంతరం మంత్రి మాట్లాడుతూ…
- ముఖ్యమంత్రి సహకారంతో రాష్ట్రంలో మైనింగ్ మరియు కార్మిక శాఖల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు
- కాకా కుటుంబానికి మరియు కార్మికులకు విడదీయలేని అనుబంధం ఉంది, కాకా స్ఫూర్తితో కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు
- రాష్ట్రంలో ఎక్కడ కూడా అక్రమ ఇసుక దందాలు నడవవని దాని ద్వారా వచ్చే రాయల్టీతో ప్రభుత్వానికి మరిన్ని నిధులు సమకూరుస్తానని తెలిపారు
