రాష్ట్రస్థాయి హాకీ విజేతలను సన్మానించిన ఎమ్మెల్యే

TEJA NEWS

రాష్ట్రస్థాయి హాకీ విజేతలను సన్మానించిన ఎమ్మెల్యే

వనపర్తి :
ఈనెల 20, 21 తేదీలలో రంగారెడ్డి జిల్లాలోని సరూర్ న గర్ లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్ – 19 హాకీ టోర్నమెంట్ బాలికల విభాగంలో మహబూబ్నగర్ హాకీ జట్టు మొదటి స్థానం సాధించింది

ఈ క్రమంలో సోమవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తన నివాసంలో క్రీడాకారులకు (బాలికల విభాగం) శాలువాలతో సన్మానించి అభినందించారు

జాతీయస్థాయిలోను సత్తా చాటాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు

ఈ సందర్భంగా జాతీయస్థాయికి ఎంపికైన సుమధుర యామిని శ్రీజ భూమికలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు

కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు కుమార్, మన్యం యాదవ్, అనిల్ కుమార్, వనపర్తి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి.కృష్ణ పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top