వాహనదారులు సరైన పత్రాలు కలిగివుండాలి..

TEJA NEWS

వాహనదారులు సరైన పత్రాలు కలిగివుండాలి..

కోదాడ ట్రాఫిక్ పట్టణ ఎస్సై మల్లేష్..( సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా)

వాహనదారులు తప్పనిసరిగా ధ్రువ ప్రతాలను, డ్రైవింగ్‌ లైసెన్స్‌, కలిగి ఉండాలని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ సూచించారు. ద్రువ పత్రాలు లేని వాహనాల గురించి బిఎస్ఎన్ఎల్ టాక్సీ స్టాండ్ వద్ద అవగాహన కార్యక్రమం. నిర్వహించారు వాహనాలు నడిపేటప్పుడు తప్పక హెల్మెట్‌ ధరించాలని, డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహనాల ధ్రువపత్రాలను దగ్గర ఉంచుకోవాలని అన్నారు.వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు వెంట తెచ్చుకోవాన్నారు. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను చెల్లించాలని వాహనదారులకు సూచించారు. ట్రాఫిక్‌ సమస్యతలెత్తకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీనివాసరావు, ఏఎస్ఐ ఖయ్యూం, హోంగార్డులు తిరుపతి, శ్రీనివాస్ పోలీసు సిబ్బంది, బిఎస్ఎన్ఎల్ టాక్సీ స్టాండ్ డ్రైవర్లు.తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top