సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మురాద్ అలీ షా దర్గా ఊర్స్ ఉత్సవాల సందర్భంగా ప్రముఖ మైనార్టీ నాయకులు లియాకత్ అలీ ఆధ్వర్యంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన గంధం సమర్పణ ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . పరమత సహనానికి ప్రతీక పటాన్చెరు పట్టణమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, వెంకట్ రెడ్డి, మైనార్టీ మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
