
నరసింహారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన……….
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి
వనపర్తి
వనపర్తి మండలం అంకూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మే రెడ్డి నరసింహారెడ్డి తల్లి పద్మమ్మ మరణించిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి వారి నివాసానికి చేరుకొనికుటుంబ సభ్యులను పరామర్శించారు. తల్లి లేని బాధ నుంచి కోలుకొని ధైర్యంగా ఉండాలని నరసింహారెడ్డి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు.
కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్, మండల్ కిసాన్ సెల్ అధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రాజు, విష్ణువర్ధన్ రెడ్డి రామ్ రెడ్డి, యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.