జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్

TEJA NEWS

జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించిన సందర్భంగా కెకెఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు చేశారు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ చౌరస్తాలో *కెకెఎం ట్రస్ట్ చైర్మన్, కాంటెస్ట్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ * జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకురాలు, కార్యకర్తలతో కలిసి టపాసులు కాల్చి సంబరాలు చేశారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు ప్రజాపాలనకు, సంక్షేమనికి కట్టుబడి ఉన్నారని ఋజువు చేసినందుకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్యంలో రాష్ట్ర అభివృద్ధి గణనియంగా పెరుగుతుందన్నారు..

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top