
ఆర్కేఎస్ఎస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
** నేటి కార్యక్రమం కోసం ఏర్పాట్లు పూర్తి
తిరుపతి: రాష్ట్రీయ క్షత్రియ సేవా సంఘం (ఆర్కేఎస్ఎస్) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం (నేడు) ఉదయం 10 గంటలకు పాత రేణిగుంట రోడ్డు లోని ఎం.కన్వెన్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు గౌరవ అధ్యక్షులు బలరామరాజు, అధ్యక్షులు అశోక్ రాజు, ప్రధాన కార్యదర్శి నారాయణ బాబు, కోశాధికారి శివరాజు, సీనియర్ జర్నలిస్ట్ సుకుమార్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ, టిటిడి మాజీ జేఈవో కె.ఎస్.శ్రీనివాస రాజు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాయలసీమలోని క్షత్రియ సోదర సోదరీమణులు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.