పెద్దమ్మ తల్లి దివ్యాశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

TEJA NEWS

పెద్దమ్మ తల్లి దివ్యాశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

130 – సుభాష్ నగర్ డివిజన్ ఎస్ఆర్ నాయక్ నగర్ లోని శ్రీ పెద్దమ్మ – పోచమ్మ తల్లి దేవాలయం 21వ వార్షికోత్సవ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….పెద్దమ్మ తల్లి దివ్యాశీస్సులు ప్రజలందరిపై ఉండాలనీ, అమ్మవారికి కృపా కటాక్షాలతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బొబ్బ రంగారావు, ఏవి. శేషాచారి, గోపాల్ రెడ్డి, బొబ్బ ప్రసాద్, కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి, ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, భాస్కర్ రెడ్డి,పూర్ణ చంద్రగుప్త, శ్రీనివాస చారి, టిటికె శ్రీనివాస్, ప్రభాకర్, ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top