11న.మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిoచడానికి పోలింగ్ సిబ్బంది సహకరించాలి…
అదనపు కలెక్టర్ రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ…
పెద్దపల్లి/ ; ఫిబ్రవరి 11న. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిoచడానికి పోలింగ్ సిబ్బంది సహకరించాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ కోరారు. ఎన్ టి పి సి ,పి టి ఎస్ కాకతీయ కళ్యాణ మండపంలో ప్రిసైడింగ్ అధికారులకు , అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు రెండవ విడత శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్లు,అభ్యర్థులు,ఏజెంట్లు ,సిబ్బంది అందరినీ సమన్వయం చేసుకుంటూ పోలింగ్ సాఫీగా జరిగేలా ప్రిసైడింగ్ అధికారులు చూడాలని,పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారులు , అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతో పాటు ఇతర సహాయక సిబ్బంది కూడా ఉంటారని అన్నారు.
ఓటరు ఒరిజినల్ గుర్తింపు కార్డు పరిశీలించిన తరువాతనే ఓటు వేయడానికి అనుమతించాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా శిక్షకులు కేడం శ్రీనివాస్ , జె. శ్రీనివాస్ లు పోలింగ్ రోజు ప్రిసైడింగ్ అధికారులు , అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు నిర్వర్తించాల్సిన విధుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఆఫీసర్ ఆంజనేయులు, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
