ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధే ధ్యేయం

TEJA NEWS

ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధే ధ్యేయం: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, కాలనీ సంఘం సభ్యులు, మహిళలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు.. ఈ సందర్భంగా పలు సమస్యలు పరిష్కరించాలని ప్రజలు విన్నవించారు. వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ప్రజలందరికీ ప్రతిరోజు అందుబాటులో ఉంటానని తెలిపారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టి అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కె.పి వివేకానంద దృష్టికి తీసుకెళ్లి వారి సహాయ సహకారాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు…. అదే విధంగా పలు శుభకార్యాల వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు…

You cannot copy content of this page

Scroll to Top