ప్రజా సంక్షేమమే ధ్యేయం….అభివృద్దే తారకమంత్రం…
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్దే తారక మంత్రంగా అందరికీ అందుబాటులో ఉండే నాయకులు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ .
ప్రతీ రోజు నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజల సమస్యలను సావధానంగా వింటూ సమస్యల పరిష్కార దిశగా అధికారులను ఆదేశించడంతో పాటు ఆత్మీయ నేతకు మా ఇంటి ఆహ్వానం అంటూ ప్రజలు అందజేసే ఆహ్వానాలను అందుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, సంక్షేమ సంఘాల సభ్యులు, మహిళా నాయకురాలు పలు వినతులు, ఆహ్వానపత్రికలు అందజేయగా సానుకూలంగా స్పందించారు.
