ఎన్టీపిసి ట్రైనింగ్ సెంటర్ లో టైలరింగ్ శిక్షణ కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాఖీ సమంత….
రామగుండం ఎన్టిపిసిలో స్థానిక మహిళలకు టైలరింగ్ శిక్షణ కార్యక్రమం ముగింపు కార్యక్రమం, ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ భవనం‑2లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డి.ఎం.ఎస్. గౌరవాధ్యక్షురాలు రాఖీ సమంత హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ట్రైనీలు, డి.ఎం.ఎస్. సీనియర్ ఎచ్ ఆర్ -సి ఎస్ ఆర్ బృందం పాల్గొన్నారు. తన ప్రసంగంలో, ట్రైనీలు తమ నైపుణ్యాలను సమర్థవంతంగా వర్తింపజేయడానికి, ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి, స్వీయ-స్థిరతను ప్రోత్సహించడంలో శిక్షణ సహాయపడుతుందని పేర్కొంది.
