
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం నూతన కమిటీ ఎన్నిక
కోదాడ పట్టణంలోని 19 వ వార్డులో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం పాలకమండలి నూతన కమిటీని శనివారం ఆలయ ప్రాంగణంలో స్థానిక కౌన్సిలర్ కోటిరెడ్డి వార్డు పెద్దలు సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ముండ్రా రామారావు, ప్రధాన కార్యదర్శిగా డి హాజీ నాయక్, ఉపాధ్యక్షులుగా విద్యాసాగర్,సహాయ కార్యదర్శిగా బియ్యాల రవికుమార్, బాడిశ రామారావు,ట్రెజరర్ గా అర్వపల్లి అప్పారావు, కార్యవర్గ సభ్యులుగా పబ్బిశెట్టి రమేష్, గుండపునేని వేణుగోపాలరావు, మారెళ్ళ వెంకటరెడ్డి, రిటైర్డ్ ఎస్సై పులి వెంకటేశ్వర్లు, వాకా సుదర్శన్ రెడ్డి, తిగుళ్ల నాగేశ్వరరావు, కొనకంచి నాగేశ్వరరావు, లచ్చిరాం నాయక్, బ్రహ్మారెడ్డి గౌరవ సలహాదారులుగా ముత్తినేని సైదేశ్వరరావు, డిసీ వెంకట్ రెడ్డి, డేగ కొండయ్య, న్యాయ సలహాదారులుగా తూమాటి సీతారామరాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు దేవాలయ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు.