
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్…..
కుత్బుల్లాపూర్ *మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ * గాంధీభవన్లో తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఇటీవల ప్రకటించిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ మరియు త్వరలో ప్రకటించబోయే డివిజన్ కమిటీలపై వారు చర్చించారు, నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై తీసుకోవలసిన అంశాలపై మహేష్ కుమార్ గౌడ్ పలు సలహాలు సూచనలు చేశారు…
అదేవిధంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా కృషి చేయాలని కోరినట్లు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ తెలిపారు…