దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. ఇటీవల మాగంటి గోపీనాథ్ మరణించగా, బుధవారం JRC కన్వెన్షన్ లో ఆయన కుటుంబ సభ్యులు దశదిన కర్మను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గోపీనాథ్ చిత్రపటం వద్ద పూలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
