కాలనీ వాసులంతా ఐక్యతగా ఉన్నపుడే కాలనీ అభివృద్ధి సాధ్యం : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
131 – కుత్బుల్లాపూర్ డివిజన్ బాల్ రెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన లే ఔట్ డిస్ప్లే బోర్డ్ ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాలనీ వాసులంతా ఐక్యమత్యంగా ఉన్నపుడే కాలనీ అభివృద్ధి సాధ్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కెఎం.గౌరీష్, కాలనీ అధ్యక్షులు పి.దుర్గారెడ్డి, ఉపాధ్యక్షులు భగీరథరెడ్డి, నాగభూషణం, వర్కింగ్ ప్రెసిడెంట్ జలునాథ్ భాను, వేమారెడ్డి, సలహాదారులు సుధాకర్ రెడ్డి, లక్ష్మయ్య, రామారావు, లింగారెడ్డి, శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, సంయుక్త కార్యదర్శి కార్తీక్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, యువ నాయకులు గిరిధర్, ఎండి.నజీర్, రమణా రెడ్డి, వెంకట్, ఆంజనేయులు, అజయ్ చారి, బొంబాయి శ్రీను, రాజు ఎషబోయిన, జయం చారి, రమేష్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
