జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయాలి
తిరుపతి: భూ కబ్జాలపై వార్తలు రాసినందుకు సూర్య జర్నలిస్టు ఉమాపతిపైన, మరికొందరు కెమెరామెన్లపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన తిరుపతి రూరల్ పేరూరుకు చెందిన టిడిపి వ్యక్తులను అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేంధర్ రెడ్డి డిమాండ్ చేసారు. భూ దందాపై కవర్ చేసేందుకు వెళ్లిన ఇద్దరు కెమెరామెన్ల కెమెరాలను ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడికి పాల్పడ్డ వారిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాము.
