వరంగల్లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలి మృతి
- వరంగల్లో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలు మృతిచెందారు. మట్టెవాడ ఎస్సై శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి మండలం బత్తంపల్లికి చెందిన ఎస్.మమతారాణి వైద్యురాలిగా పనిచేస్తున్నారు.
