గద్వాల పోలీస్ విభాగానికి చేరిన ట్రెయిన్డ్ జాగిలం ‘ఆర్య’.
గద్వాల : ఎనిమిది నెలల బేసిక్ శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ జాగిలం ‘ఆర్య’ను గద్వాల జిల్లాకు కేటాయించారు. ఐఐటీఏ మొయినాబాద్లో శిక్షణ పొందిన‘ఆర్య’ పేలుడు పదార్థాలను గుర్తించడంలో నైపుణ్యం సాధించిందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. డాగ్ హ్యాండ్లర్ భీమేష్, డాగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ రవికుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నరేష్, వెంకటేష్లు SP శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి ‘ఆర్య’ను పరిచయం చేశారు.
