శనగపాడు గ్రామంలో రైతులకు స్మార్ట్ అగ్రికల్చర్పై శిక్షణ కార్యక్రమం
పెనుగంచిప్రోలు,
పెనుగంచిప్రోలు మండలం శనగపాడు గ్రామంలోని గ్రామీణ కృషి పరిజ్ఞాన కేంద్రం (GKPK) లో స్మార్ట్ అగ్రికల్చర్ కార్యక్రమంలో భాగంగా రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ScaNxt కంపెనీ ప్రతినిధులు రైతులకు భూ పరిశోధన కిట్ (Bhu Parikshak Kit) ను ఉపయోగించి నేల పరీక్షలు ఎలా చేయాలి, ఆ పరీక్షల ఆధారంగా స్మార్ట్ అగ్రికల్చర్ పద్ధతులను ఎలా అమలు చేయాలి అనే విషయాలపై ప్రత్యక్షంగా ప్రదర్శన (డెమో) ఇచ్చి శిక్షణ అందించారు. ఈ శిక్షణ ద్వారా రైతులు తమ భూమి యొక్క పోషక స్థితిని తెలుసుకొని సరైన ఎరువుల వినియోగంతో పంటల దిగుబడిని పెంచుకోవచ్చని వివరించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కీసర సైదులు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో స్మార్ట్ అగ్రికల్చర్ కార్యక్రమాలను GKPK కేంద్రంలో విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆధునిక వ్యవసాయ పద్ధతులను నేర్చుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డి , Aspirational Blocks Coordinator మోహన్ సందీప్, ScaNxt మేనేజర్ జె.ఎన్.వి.ఎస్.వి ప్రసాద్ , గ్రామ వ్యవసాయ సహాయకుడు బచ్చలకూరి. రాంబాబు ,మరియు గ్రామ రైతులు
