ఫస్ట్ ఎవెన్యూ కాలనీలో డ్రైనేజీ మరియు మంచి నీటి సమస్యతో ఇబ్బంది

TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి ఫస్ట్ ఎవెన్యూ కాలనీలో డ్రైనేజీ మరియు మంచి నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని తెలియజేయడంతో కాలనీ వాసులతో కలిసి కాలనీ లో పర్యటించి కాలనీ లో ఉన్న సమస్యల యొక్క వివరాలను అడిగి తెలుసుకొని సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి,మధు గౌడ్,నాగేందర్ రెడ్డి,నాగేశ్వర్ రావు,రామ్ రెడ్డి,ధనుంజయ రావు,కె.కిషోర్,వి.భరత్,విజయ్ కుమార్,నర్సింగ్ రావు,శ్రీనివాస్,అఫ్రెజ్,జలరాం దేవసి,హామీరా రామ్ దేవసి,దామోదర్,ఆనంద్ కుమార్,కె.రమణ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top