జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇటీవలే భారీ మెజారీటితో ఎమ్మెల్యేగా గెలిచిన వి నవీన్ యాదవ్ ని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హైదరాబాద్ యూసుఫ్ గూడా నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. నవీన్ యాదవ్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టిందన్నారు. నవీన్ యాదవ్ ని భారీ మెజార్టీతో గెలిపించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపులో ఎంతో కష్టపడి పని చేసిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు సైతం కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మారబోయిన రాజు యాదవ్, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, మారబోయిన సాయి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
