25 ఏళ్లుగా ప్రజా సేవలో ఉన్న మరోమారు ఆదరించాలని విజ్ఞప్తి చేసిన ……వాకిటి శ్రీధర్
ఓట్లు అడిగే నైతిక హక్కు
కాంగ్రెస్ నాయకులకు లేదు
వనపర్తి : గత 25 ఏళ్లుగా కౌన్సిలర్ గా మున్సిపల్ వైస్ చైర్మన్ గా ప్రజాప్రతినిధిగా నాయకుడిగా ప్రజాసేవలో ప్రజలతో మమేకమై సాగుతున్నానని మరో మారు 30 వ,వార్డు ప్రజలు ఆదరించి కౌన్సిల్కు పంపిస్తే వార్డు అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఇంటింటి ప్రచారంలో వాకిటి శ్రీధర్ ఓటర్లకు హామీనిచ్చారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరుగారింటిలు 420 హామీల పేరుతో నాయకులు అభ్యర్థులు మీ ముందుకు వస్తారని హామీల్లో బాకీ పడిన మొత్తాన్ని చెల్లించాకే ఓట్లు అడగాలని సూచిస్తూ హామీలు అమలు చేయకుండా ఓట్లు అడిగే అర్హత వారికి లేదని ఆ పార్టీ అభ్యర్థులు శాసనసభ్యులు తనది అదే వార్డు అని ప్రత్యేక నిధులు తీసుకువచ్చి వార్డు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని సదరు నాయకులు నమ్మ పలుకుతున్నారని వారి మాటలు నమ్మవద్దని ఈ సందర్భంగా వాకిటి ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు
