విశాల తెలంగాణ తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన కుత్బుల్లాపూర్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్
క్యాలెండర్ ఆవిష్కరించిన అనంతరం శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ తెలుగు పత్రికా రంగంలో తనదైన ప్రత్యేక గుర్తింపుతో, ప్రజాస్వామ్య విలువలతో కట్టుబడి ప్రజల పక్షాన నిలుస్తున్న పత్రిక విశాల తెలంగాణ తెలుగు దినపత్రికని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ దినపత్రిక ఎండి జి. సాయి కృష్ణ, తెలంగాణ రాష్ట్ర నెట్వర్క్ ఇంచార్జ్ కె. గౌతమ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి పి. బ్రహ్మచారి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బొబ్బ రంగారావు, తౌఫిక్, రాజిరెడ్డి, సంతోష్, డాన్ శీను, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
