వరద నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం

TEJA NEWS

వరద నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

125 – గాజుల రామారం డివిజన్ “ఓక్షిత హిల్ వ్యూ” కాలనీలో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అధికారులతో కలిసి పర్యటించి కాలనీలో నెలకొని ఉన్న భూగర్భ డ్రైనేజీ, వరదనీటి సమస్యను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాలనీలో నెలకొని భూగర్భ డ్రైనేజీ, వరద నీటి సమస్యకు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎస్.ఈ.చెన్నారెడ్డి, ఈఈ కిష్టప్ప, వాటర్ వర్క్స్ అధికారులు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, ఓక్షిత హిల్ వ్యూ సంక్షేమ సంఘం అధ్యక్షులు కృష్ణ, సురేందర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top