2026 జనవరి నెల యన్ టి ఆర్ సామజిక పెన్షన్లు డిసెంబర్, 31న పంపిణీ
జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న యన్ టి ఆర్ భరోసా ఫించన్లు డిశంబర్ 31 న పంపిణీ చేయడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు 2026 జనవరి 1 వ తేదీ (నూతన సంవత్సరం కారణంగా) 2026 జనవరి 1 న పంపిణి చేయవలసిన పెన్షన్లు ను ఈ నెల 31 న బుధవారం ఉదయం 6 గంటల నుండి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 30 న సచివాలయ సిబ్బంది బ్యాంకు ల నుండి నగదు డ్రా చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ఈ నెల 31 నే వంద శాతం పెంచన్లు పంపిణీ చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అనివార్య కారణం ల చేత 31న తీసుకోని వారికి 2 వ తేదీ న పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
