ధూప దీప నివేదిక పథకానికి భద్రాద్రి నుంచి 65 దరఖాస్తులు
భద్రాద్రి : ధూప దీప నివేదిక పథకానికి దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారంతో ముగిసింది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 210 ఆలయాల నుంచి దరఖాస్తులు వచ్చాయి.ఖమ్మం 145, భద్రాద్రి నుంచి 65అందాయి.అర్హత కలిగిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర కమిషనర్ కు పంపిస్తారు. అర్హత కలిగిన ఆలయాలకు పడితరం కింద రూ. 4 వేలు అర్చకుల గౌరవ వేతనంగా రూ. 4 వేలు ప్రభుత్వం అందిస్తుంది.ప్రస్తుతం ఈ పథకం ఉమ్మడి జిల్లాలో 450 ఆలయాలకు అమలు అవుతుంది.
