టీటీడీకి రూ.కోటి విరాళం
తిరుమల: ప్రవాసదేశ భక్తుడు అయిన తోట చంద్రశేఖర్ టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ (బీ.ఆర్)నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు.
