వైసీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
వైఎస్సార్సీపీ పల్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని తెలిపారు.
