ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2 లోని శ్రీశ్రీశ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా నిన్న ప్రత్యేక పూజాలు, అభిషేకాలు నిర్వహించడం జరిగింది. ఉపవాసం ఉన్న భక్తులకు ఉదయం ఆలయాప్రాంగణంలో నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై వారి చేతులమీదుగా అన్నసమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్న ప్రసాదలు అందించడం జరిగింది. కార్యక్రమంలో సమ్మారెడ్డి, భాస్కర్ రెడ్డి, శ్యామల, లింగయ్య, వెంకటేశం గౌడ్, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.
