ఎంపీ వైవి సుబ్బారెడ్డిని కలిసిన అంబటి మురళి
పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ , రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ని తాడేపల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి పొన్నూరు నియోజకవర్గం నకు సంబంధించిన అనుబంధ విభాగాల కమిటీలు త్వరితగతిన పూర్తి చేయాలని మురళీకృష్ణ కు సూచించారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి సమన్వయంతో పనిచేయాలని కోరారు.
