విశాఖకు ప్రధాని రాక.

TEJA NEWS

విశాఖకు ప్రధాని రాక.

ప్రధాని మోదీ విశాఖ రానున్నారు. భువనేశ్వర్‌ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 6.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు.

అక్కడి నుంచి ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ ఆఫీసర్స్‌ మెస్‌కు వెళతారు. రాత్రి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం 6.25కు రోడ్డు మార్గం ద్వారా ఆర్కే బీచ్‌కు చేరుకుంటారు. 6.30 నుంచి 7.50 వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా యోగా విన్యాసాల్లో పాల్గొంటారు.

7.50కు బయల్దేరి రోడ్డు మార్గం ద్వారా ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ ఆఫీసర్స్‌ మెస్‌కు వెళతారు. ఉదయం 8.15 నుంచి 11.15 వరకు ప్రధాని ప్రొగ్రామ్‌ రిజర్వ్‌లో ఉంది. మళ్లీ 11.25కు ఐఎన్‌ఎస్‌ సర్కార్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ నుంచి హెలికాప్టర్‌లో విశాఖ విమానాశ్రయానికి చేరుకుని 11.50 గంటలకు ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ
బయలుదేరతారు.

You cannot copy content of this page

Scroll to Top